తిరుపతి బ్యూరో ,అద్దం న్యూస్ ,సెప్టెంబర్ 16;
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో 3 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 2 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.ఇక, శని, ఆదివారాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.8.89 కోట్లు. అలాగే ఆది, సోమవారం 1.79 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, 70,044 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
Post Views: 11






