హైదరాబాద్ బ్యూరో ,అద్దం న్యూస్ ,సెప్టెంబర్ 16; తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు నిజామాబాదు జిల్లా అంటే ప్రభుత్వానికి చిన్న చూపు ప్రభుత్వం చేసే చర్యల వల్ల అవసరం అయితే రాజీనామా చేస్తా అంటూ ప్రకటన నాకు పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి – నేను రాజీనామా చేయాలని అనుకుంటున్న కొడంగల్ తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిదులు తీసుకెళ్తున్నారు – మా జిల్లాకు ఎన్ని నిదులు ఇచ్చారో చిట్టా తెచ్చిన అన్ని లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా.. పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్ అభివృద్ధి విషయం గురించి సభలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎవరికి పట్టని జిల్లా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.






